Modi caste vote Ahmadabad lok sabha
జాతీయం

Ahmedabad: ఓటేసిన ప్రధాని మోదీ

  •  ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్
  • పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఓటేసిన మోదీ
  • భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు
  • అధిక ఓట్లు వేసి సరికొత్త రికార్డు సృష్టించాలని వినతి

Modi: ప్రధాని మోదీ గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్ లో ఓటేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు. అంతకుముందు సార్వత్రిక సమరం మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన మద్దతుదారులను ఓటేసిన అనంతరం మోదీ పలకరించారు. అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని మరోసారి కోరారు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఇప్పటికే సూరత్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 సీట్లకు మంగళవారం పోలింగ్‌ జరిగింది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!