Maha Kumbh Mela | దేశమంతా ఇప్పుడు కుంభమేళా గురించే మాట్లాడుకుంటోంది. భూమ్మీద జరిగే అతిపెద్ద మానవ సమాహారంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతటి కుంభమేళాకు ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా వచ్చి దర్శించుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళాలో వాటర్ బాలిల్స్, టీలు, స్నాక్స్, తిండి పదార్థాలకు సంబంధించిన వాటితో పాటు అన్ని రకాల అవసరాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దొరికిన అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ మహా కుంభ్ లో ఓ ఛాయ్ వాలా సంపాదన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను రోజుకు రూ.7వేల దాకా సంపాదిస్తున్నాడు. ఖర్చులకు రూ.2వేలు పోయినా.. ఇంకా ఐదువేలు వెనకేసుకుంటున్నానని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కుంభమేలా నెల రోజుల పాటు ఉంటుంది. అంటే ఎంత లేదన్నా రూ.1.5లక్షలు సంపాదిస్తాడన్నమాట. ఈ విషయం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. పెద్ద పెద్ద జాబులు చేసే వారికి కూడా ఇంత సంపాదన లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.