Bird flue effect india: ఆ నాలుగు రాష్ట్రాలకూ బర్డ్ ఫ్లూ అలర్ట్:
Bird flue virus india
జాతీయం

National news: ఆ నాలుగు రాష్ట్రాలకూ బర్డ్ ఫ్లూ అలర్ట్

Bird flue effect india dangerous bells to 4 states central government warns:
దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాధిని ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని కూడా పిలుస్తారు. ఇది కోళ్లు, పక్షులకు త్వరగా సో కుతుంది. ఇన్ ఫ్లూయెంజా టైప్ -ఏ లో డజనుకు పైగా వైరస్ లు ఉన్నాయి. హెచ్ 5 ఎన్8, హెచ్ 5 ఎన్ 1 రకాలకు చెందిన వైరస్ లు కోళ్లు, బాతులు తదితర పక్షులకు వేగంగా వ్యాప్తిచెందుతూ ఉంటాయి. అయితే హెచ్ 5 ఎన్ 1 రకం ఇన్ ఫ్లూచెంజా వైరస్ ప్రాణాంతకమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లోనే వెల్లడించింది. భారత్ లో మాత్రం 2006 లో ఈ రకం వైరస్ బయటపడింది. ప్రతి సంవత్సరం మన దేశానికి వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తుంటుంది.

కేంద్రం హెచ్చరికలు జారీ

అయితే నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో కూడిన కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కోళ్లు, ఇతర పక్షులకు సంబంధించిన అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని రాష్ట్రాలను కోరింది. తద్వారా బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, జార్ఖండ్‌లోని రాంచీలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో కూడిన కేసులను గుర్తించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో యాంటీవైరల్‌ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు మే 25న కేంద్ర పశుసంవర్ధక శాఖ నిర్దేశించింది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు వాటిని పెంచే వారి నుంచి శాంపిల్స్ సేకరించి హెచ్‌5ఎన్‌1 పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా సంకేతాలు, లక్షణాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు/ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించబడింది. అన్ని పౌల్ట్రీ ఫామ్‌లలో సమగ్ర భద్రతా అంచనాలు సిఫార్సు చేయబడ్డాయి.

ప్రజలకు తెలియజేయాలని సూచన

పక్షులు, దేశీయ కోళ్ల మధ్య సంబంధాన్ని నిరోధించే చర్యలు అమలు చేయాలని కోరారు. దీనిని నివారించే చర్యల గురించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్రాలకు కూడా సూచించబడింది. ఇంకా, తగినంత సంఖ్యలో యాంటీవైరల్ మందులు, పిపిఇ, మాస్క్‌లు మొదలైన వాటిని నిల్వ చేయడం వంటి అన్ని నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలని వారిని కోరారు.

పశుసంవర్ధక, డెయిరీ శాఖ ఆదేశాలు జారీ

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మే 25న జారీ చేసిన సంయుక్త ఆదేశాల ప్రకారం 2024 నాటికి నాలుగు రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పూర్), కేరళ (అలప్పుజా, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలు), జార్ఖండ్ (రాంచీ) పౌల్ట్రీలో ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా వ్యాప్తి ఇప్పటికే నివేదించబడింది.

హెచ్ 5 ఎన్ 1 వేగంగా వ్యాపించే వ్యాధి

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా హెచ్ 5 ఎన్ 1 ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. ప్రజలకు వ్యాపించే అధిక సంభావ్యత ఉన్నందున, ఈ సంక్రమణ వ్యాప్తిని తగ్గించడానికి, నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ఉమ్మడి సలహా పేర్కొంది.

వలస పక్షుల మధ్య వైరస్

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్లు సాధారణంగా వలస పక్షుల మధ్య వ్యాపిస్తాయి. ఇది పెంపుడు పౌల్ట్రీ పక్షుల మధ్య వ్యాప్తికి కారణమవుతుంది. అలాగే, ఇది బహుశా కోళ్లతో సంపర్కానికి వచ్చే వలస పక్షుల వల్ల కావచ్చు.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!