Badrinath
జాతీయం

Badrinath : 57 మందిపై కూలిన మంచు కొండలు.. బద్రినాథ్ లో దారుణం..!

Badrinath : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనులు చేస్తున్న 57 మంది కార్మికులపై ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం భారీగా మంచు పడుతోంది. దీంతో కొండల మీద దట్టంగా మంచు పేరుకుపోయింది. బద్రీనాథ్ జిల్లా థామ్ లోని బీఆర్ వో హైవే మీద కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న మంచు కొండలు (icebergs) ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.

మంచు చరియలు కార్మికుల మీద పడటంతో పోలీసులు, బీఆర్ వో (Bro) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే 10 మందిని క్షేమంగా కాపాడారు. కానీ 47 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో.. ఎంత మంచు తోడినా ఇంకా పేరుకుపోతూనే ఉంది. మనా గ్రామంలోని బీఆర్ ఓ క్యాంప్ కు అతిదగ్గర్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంచు చరియల కింద చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటపడాలని అంతా కోరుకుంటున్నారు.

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?