National:లద్దాక్ లో వరదల్లో చిక్కుకున్న భారత ఆర్మీ
Ladhak floods
జాతీయం

National:లద్దాక్ లో వరదల్లో చిక్కుకున్న భారత ఆర్మీ

గల్లంతయిన ఐదుగురు సైనికులు
నీటి ఉద్ధృతి పెరిగి మునిగిన టీ-72 ట్యాంక్‌
లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఘటన
మృతుల కోసం గాలిస్తున్న సైన్యం
ఒకరి మృత దేహం లభ్యం

5 Army personnel dead after tank sinks due to flash floods in Ladakh

చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. భారత ఆర్మీకి చెందిన యుద్ధ ట్యాంక్ టీ72.. ష్యోక్ అనే నదిని దాటుతుంది. సరిగ్గా నది మధ్యలోకి యుద్ధ ట్యాంక్ రాగానే.. నది నీటి మట్టం ఒక్కసారిగా.. అమాంతం పెరిగింది.

కొట్టుకుపోయిన జవాన్లు

ఆకస్మిక వరదలతో యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. అందులో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన మిగతా జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతు అయిన జవాన్ల కోసం గాలించగా.. ఒకరి మృతదేహం లభించిందని.. మరో నలుగురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం