Excise police raided: మొయినాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ పై దాడి చేసిన ఎక్సయిజ్ డీటీఎఫ్ పోలీసులు 4లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో మందు దావత్ ఇచ్చిన వ్యక్తితోపాటు ఫంక్షన్హాల్ యజమానిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మొయినాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఓ కుటుంబం తమ పిల్లలకు సంబంధించిన విందు జరిపింది. అతిధులందరికీ మందు దావత్పెట్టింది. ఈ మేరకు సమాచారం అందటంతో శంషాబాద్ ఎక్సయిజ్ డీటీఎఫ్సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డితోపాటు కానిస్టేబుళ్లు గణేశ్, మల్లేష్, నెహ్రు, సాయిశంకర్, శేఖర్ లతో కలిసి దాడి చేశారు.
Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!
ఢిల్లీకి చెందిన 60 బ్లాక్ లేబుల్, గోవాకు చెందిన 4 బాటిళ్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సీజ్ చేశారు. దాంతోపాటు తెలంగాణకు చెందిన 3 లిక్కర్ బాటిళ్లతోపాటు 12 బీర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మందు దావత్ ఇచ్చిన వ్యక్తి తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని శంషాబాద్ ఎక్సయిజ్ సూపరిండింటెంట్ కృష్ణప్రియ తెలిపారు.