Vishwak Sen: వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen). ప్రస్తుతం ఆయన హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించి, న్యూ ఇయర్ స్పెషల్గా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ వదిలారు. ఈ సినిమా చూస్తుంటే రానా దగ్గుబాటి నటించిన ‘లీడర్’ చిత్రానికి సీక్వెలా? అన్నట్లుగా ఉంది. ‘లెగసీ’ (Legacy Movie) అనే టైటిల్తో రాబోతున్న ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ విశ్వక్ సేన్ పొలిటికల్ లీడర్గా కనిపించబోతున్నారు. ఆయన లుక్, ఆహార్యం అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ టీజర్ చూస్తుంటే, ఈ సినిమా చాలా విషయాలను టచ్ చేయబోతుందని అనిపిస్తుంది. అంతేకాదు, ఈ టీజర్లో తన తండ్రి సమాధిపైనే మూత్రం పోసి.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని విశ్వక్ చెప్పడం చూస్తుంటే.. ఆయన మార్క్ కూడా ఇందులో ఉంటుందనేది అర్థమవుతోంది. ఈ టీజర్ని గమనిస్తే..
Also Read- Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!
దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ వార్
ఈ అనౌన్స్మెంట్ టీజర్లో రోల్స్ రాయిస్ కారులో నుంచి దిగిన విశ్వక్ సేన్.. నడుచుకుంటూ ఓ సమాధి దగ్గరకు వెళ్లి పైన చెప్పుకున్న పని చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఆయన వాయిస్లోనే.. ‘‘రాజకీయమంటే పులి మీద సవారీలాంటిదని అంటారు. మరి ఆ పులి మీద ఆ నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? లేదా తన కుటుంబం మొత్తం కూర్చోవాలా? దిగితే చంపేస్తారు కదా.. మరి తన కుటుంబం, తన వారసులు, తన ఫ్యామిలీ లెగసీ ఏమైపోవాలి? మనం ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తామో.. వాళ్లని తీవ్రంగా ధ్వేషించే సమయం వస్తుంది. అప్పుడు మనం వాళ్ల నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటాం. కానీ, మన DNA మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్ గేమ్స్లో తన కుటుంబాన్ని కూడా వాడుకునే ఒక తండ్రి.. దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ వార్. నిజమైన లెగసీ కోసం..’’ అంటూ ఓ లెంగ్తీ డైలాగ్ను చెప్పించారు. తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేసి, అక్కడ అతను సమాధిపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, తన గదిలో కాల్పులు జరపడం వంటి దృశ్యాలు ఉత్కంఠను పెంచాయి. ఈ డైలాగ్తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందనేది స్పష్టమవుతోంది.
2026లోనే విడుదల
విశ్వక్ సేన్ సరసన కన్నడ బ్యూటీ ఏక్తా రాథోడ్ (Ekta Rathod) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్ వంటి వారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ‘పిండం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత, దర్శకుడు సాయి కిరణ్ దైదా (Sai Kiran Daida) ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాకి ప్రాణం పోస్తున్నారనేది ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. టీజర్ లోని విజువల్స్ ఆయన సాంకేతిక మరియు కళాత్మక నైపుణ్యాన్ని స్పష్టం చేశాయి. నిర్మాతలు యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. ఇంటెన్స్ అండ్ పర్సనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని 2026లోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

