Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మికా మందన్న (Rashmika Mandanna) జంటగా, రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో.. ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వీడీ 14’ చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ, రిపబ్లిక్ డే సందర్భంగా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ పక్కా అంటే.. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. టెక్నికల్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటున్నట్లుగా ఈ గ్లింప్స్లోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాకు ‘రణబాలి’ (Ranabaali) అనే పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ గ్లింప్స్ విడుదల చేస్తూ.. విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘బ్రిటీష్ వారు అతడిని ఒక క్రూరుడు అని పిలిచారు.. నేను ఆ మాటతో ఏమాత్రం విభేదించను. అవును, అతను ‘మన’ కోసం క్రూరంగా మారిన మన యోధుడు! ఒకే ఒక్కడు.. ఆయనే ‘రణబాలి’. అతడిని పరిచయం చేస్తున్నాము. అంతేకాదు, వారు పాతిపెట్టాలని చూసిన మన అసలైన చరిత్రను ఇప్పుడు ప్రపంచానికి చాటి చెబుతున్నాం’’ అని విజయ్ దేవరకొండ ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ని గమనిస్తే..
Also Read- Poonam Kaur: పవన్ కళ్యాణ్కు ఆ అర్హత లేదు.. పూనమ్ షాకింగ్ పోస్ట్!
దాచిపెట్టిన చాప్టర్
‘‘ఇది స్వాతంత్ర్యానికి సంబంధించిన కథ కాదు. అంత కంటే ముందు దాచి పెట్టబడిన చాప్టర్కు సంబంధించిన కథ. బ్రిటీష్ ఆక్రమిత భారతదేశంలో జరిగిన ఒక సామూహిక మారణహోమం (Genocide) కథ. ఇది హిట్లర్ చేసిన హోలోకాస్ట్ కంటే అత్యంత భయంకరమైనది. 45 ట్రిలియన్ డాలర్స్ ఇండియా నుంచి దొంగిలించబడ్డాయి. 40 సంవత్సరాలలో 100 మిలియన్ల మంది చంపబడ్డారు’’ అని చెబుతూ.. ఇందులోని ప్రతి లైన్కు ఏం జరిగిందనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. అలాంటి సమయంలో ఓ ధగడ్ వచ్చి, బ్రిటీష్ వాళ్ల తలలు నరికాడని చూపిస్తూ.. విజయ్ దేవరకొండను వీరోచితంగా చూపించారు. అతడే ‘రణబాలి’ అని పరిచయం చేస్తూ.. సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఇందులో జయమ్మగా రష్మికా మందన్న కనిపించనుంది. ఒక బ్రిటీష్ వాడి మెడను తాళ్లతో కట్టి.. విజయ్ దేవరకొండ గుఱ్ఱంపై వీరోచితంగా రైలు పట్టాలపై లాక్కొస్తున్నట్లుగా చూపించారు. ఈ సన్నివేశంలో విజయ్ వీరత్వం చూస్తే.. గూస్బంస్స్ పక్కా రావాల్సిందే. ఒక్క టైటిల్ గ్లింప్స్తోనే సినిమాపై భారీ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడంలో మేకర్స్ ప్రతిభను కనబరిచారు. చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా, ఈ గ్లింప్స్ తర్వాత మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఎప్పుడెప్పుడు వస్తుందా? అనేలా గ్లింప్స్ని హై టెక్నికల్ వ్యాల్యూస్తో రెడీ చేశారు.
Also Read- David Reddy: రూత్లెస్, బ్రూటల్ అవతార్లో మంచు మనోజ్.. భయపడాల్సిందే!
భారీ బడ్జెట్తో
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో విజయ్, రష్మిక జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని విజయ్ దేవరకొండకు ఇచ్చిన రాహుల్ సంకృత్యన్.. ఈ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ని ఇస్తాడనేలా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కెరీర్లో లేని విధంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

