Tollywood controversies: టాలీవుడ్ లో సినిమాల విడుదలకు ముందు కాంట్రవర్సీలు ఒక ట్రెండ్లా మారుతున్నాయి. 2025లో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పృధ్వి రాజ్ రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో ‘బాయ్కాట్ లైలా’ అంటూ ట్రెండ్ అవుతూ పోయింది. విశ్వక్ సేన్ కూడా దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది సినిమాకు ఎంత వరకూ ఉపయోగ పడిందో తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో సాధారణం అయిపోయాయి. రిషబ్ షెట్టి ‘కాంతార చాప్టర్ 1’ హైదరాబాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో తెలుగు మాట్లాడకుండా కన్నడంలోనే మాట్లాడటంతో ‘బాయ్కాట్ కాంతార చాప్టర్ 1’ హ్యాష్ట్యాగ్ వైరల్ అయింది. కానీ సినిమా కంటెంట్ ముందు ఇవేమీ నిలవలేకపోయాయి. కట్ చేస్తే సినిమా రూ.600 కోట్ల మార్కును దాటేసింది. మరీ విచిత్రం ఏమిటంటే ఇతర భాషల్లో తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించింది ఈ సినిమా.
Read also-SYG Glimpse: ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. బీస్ట్ మోడ్లో సాయి దుర్గా తేజ్..
కాంట్రవర్సీలు
టాలీవుడ్లో ఇలాంటి కాంట్రవర్సీలు 2025లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘బ్యూటీ’ సినిమా ప్రీ-రిలీజ్లో డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ. అలాగే, ‘డ్రాగన్’ ప్రీ-రిలీజ్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ నాన్-తెలుగు హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ ఘటనలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయా లేక డ్యామేజ్ చేస్తున్నాయా? ఇవి పూర్తిగా పబ్లిసిటీ కోసమా? ఈ ఆర్టికల్లో దాని వెనుక రహస్యాలు చూద్దాం.చాలా మంది ఇవి పబ్లిసిటీ స్ట్రాటజీ అని అంటున్నారు. ‘బ్యాడ్ పబ్లిసిటీ ఈజ్ బెటర్ దాన్ నో పబ్లిసిటీ’ అనే సూత్రం టాలీవుడ్లో పని చేస్తోంది. ‘లైలా’ సినిమా పృధ్వి వ్యాఖ్యల వల్ల మేజర్ తెలుగు పత్రికల ఫ్రంట్ పేజీలకు చేరింది, అయినా అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. ‘బ్యాడ్ గర్ల్’ సినిమా కూడా కాంట్రవర్సీలతో పబ్లిసిటీ పెరిగింది. ప్రెస్ మీట్స్ పెయిడ్ పీఆర్ గిమ్మిక్స్గా మారాయి, జెన్యూన్ ఇంటరాక్షన్స్ కాకుండా కంటెంట్ ఫ్యాక్టరీలుగా మారాయి. సోషల్ మీడియా ఇందుకు ఆయుధం.
Read also-Pawan Kalyan wishes Sai Tej: సాయి దుర్గా తేజ్ కు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు.. అందుకేనా?
నిజమైన సమస్యలు
సోషల్ మీడియా షాడో కాస్ట్ చేస్తోంది. అల్లు అరవింద్, విష్వక్ సేన్ మధ్య వివాదం సోషల్ మీడియా వల్ల పెరిగింది. పూజా హెగ్డే ఇండస్ట్రీ డార్క్ సైడ్ గురించి, నెగెటివ్ పీఆర్ క్యాంపెయిన్స్ గురించి మాట్లాడింది. 2025లో హిట్స్ తక్కువగా ఉన్నాయి, ‘సంక్రాంతికి వస్తునాం’, ‘కోర్ట్’ మాత్రమే సక్సెస్. డైరెక్టర్ ప్రాబ్లమ్స్, ప్రొడక్షన్ డిలేలు ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నాయి. ఈ ట్రెండ్ టాలీవుడ్కు లాంగ్టర్మ్లో దెబ్బ తీస్తుంది. కొంత బజ్ తెచ్చినా, ప్రేక్షకులు దూరమవుతున్నారు. మేకర్స్ ఈ కాంట్రవర్సీలను కంట్రోల్ చేసి, కంటెంట్పై ఫోకస్ చేయాలి. లేకపోతే, 2025 మరింత డల్గా మారుతుంది. ఇండస్ట్రీ యూనిటీ, రెస్పాన్సిబుల్ ప్రమోషన్తో ముందుకు సాగాలి. ఇలా నెగిటివ్ గా సినిమా ప్రేక్షకులను దగ్గర అయితే.. ప్రేక్షకులు దూరం అవుతారు. ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
