Sunitha on Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా ప్రవస్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొత్త విషయాలను బయట పెట్టింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Mulugu District: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్!
గత మూడు రోజుల నుంచి ఈ వివాదం పై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే, నెటిజన్స్ ప్రవస్తి వైపే ఉన్నారు. ఆమె ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో నన్ను ఎలిమినేట్ ముందే ఎలిమినేషన్ గురించి మర్చిపోకు గుర్తుపెట్టుకో అని చెప్పారంటూ తన మాటల్లోనే చెప్పుకొచ్చింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Rain Alert in Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం
మీరు ఎలిమినేట్ అయ్యారు కదా.. మళ్లీ వెళ్తారా అని యాంకర్ అడగగా .. అప్పుడు సింగర్ ప్రవస్తి ” అసలు ఆరోజు పాడుతా తీయగా డైరెక్టర్ ముందే నా దగ్గరకు వచ్చి ఎలిమినేషన్ ఉంది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఆ టైం లో అలా ముందే చెబితే నేను లో అవుతాను కదా .. ఇంక నేను ఎలా మంచిగా పాడగలను .. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి నన్ను ఎలిమినేట్ చేశారు ? నేను అంత తప్పు ఏం చేశా ? సింగర్ సునీత మేడం కి నేను కనిపించలేదా? అయిన నేను వీడియో చేశాక ఆమె వైపు తప్పు లేకపోతే బయటకు రావాల్సిన అవసరం లేదు కదా .. బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఆమె వైపు తప్పు ఉందనే కదా అర్ధం ” అంటూ షాకింగ్ నిజాలు బయటకు వెల్లడించింది. ఈ విషయాలు ఇప్పుడు మళ్లీ కొత్త చర్చకు తెరలేపేలా ఉన్నాయి. మరి, ఏం జరుగుతుందో చూడాలి.