Rajendra Prasad: ‘పద్మశ్రీ’.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా!
Veteran Telugu actor Rajendra Prasad reacting after being honored with the prestigious Padma Shri award, seen in a dignified pose.
ఎంటర్‌టైన్‌మెంట్

Rajendra Prasad: ‘పద్మశ్రీ’.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా!

Rajendra Prasad: తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ (Nata Kireeti Rajendra Prasad)ను పద్మశ్రీ (Padma Shri) వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారంపై రాజేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ​అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, ‘నటకిరీటి’ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను’’ అంటూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఎమోషనల్ అయ్యారు. ఆయన విడుదల చేసిన వీడియోలో..

Also Read- Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందనిదే!

ఈ అవార్డు నాది కాదు.. మీది

‘‘నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్లు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి, ఇంత గొప్పటి గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరును ఈ పురస్కారానికి సిఫార్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు.. మీది. దాదాపు 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా, మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా, ఏడిపించినా.. ‘మా రాజేంద్ర ప్రసాద్’ అని మీరు చూపించిన ఆప్యాయత.. నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు ఇక్కడ వరకు నడిపించింది. ఈ అవార్డును నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

Also Read- Megastar Chiranjeevi: ఆ మహిళ వీడియో చూసి నా కళ్ళు చెమర్చాయి

మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బతికున్నంతవరకు సర్వదా.. మీ రాజేంద్ర ప్రసాద్’’ అని రాజేంద్రుడు ఈ వీడియోలో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అవార్డుకు మీరు అర్హులు, చాలా ఆలస్యమైంది, ఇప్పటికే మీకు వచ్చి ఉండాల్సింది అంటూ రాజేంద్ర ప్రసాద్ అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరైన గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?