Pithapuramlo: తొలి చిత్రం ‘ప్రేయసి రావే’తోనే దర్శకునిగా తన సత్తా చాటుకున్నారు మహేష్ చంద్ర. ఆ తర్వాత “అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్” చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Read also-Vikram 4K Re-Release: కమల్ హాసన్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ‘విక్రమ్’ రీ రిలీజ్ ఎప్పుడంటే..
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్చంద్ర మాట్లాడుతూ – “ కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ చూడొచ్చు. ప్రేక్షకులు ఏదో ఒకరకంగా ఈ కథతో కనెక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో ‘పిఠాపురం’ అనేది ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్లో 15 రోజులు, గోవాలో 6 రోజులు చిత్రీకరణ జరిపాం. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. గోవాలో ఒక పాటను, హైదరాబాద్లో సెట్వేసి ఇంకో పాటను, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్లో మరో పాటను చిత్రీకరించాం. దర్శకునిగా నాకు జీవితాన్ని ప్రసాదించిన ‘మూవీమొఘల్’ డి. రామానాయుడు గారి స్ఫూర్తితో కథను నమ్మి, ఎక్కడా వేస్టేజ్ లేకుండా ఈ సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని తెలిపారు.
Read also-Shiva 4K Trailer: ‘శివ’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఏంటి భయ్యా ఆ ర్యాంపేజ్..
డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథను ఆకుల సురేష్ పటేల్ అందించారు. స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్ శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్ B. సత్యనారాయణ, మ్యూజిక్ క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజి సండ్రాల ఉన్నారు. నిర్మాతలుగా దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య) వ్యవహరించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోండంతో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేయసి రావే తో మంచి విజయం సాధించిన దర్శకుడు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
