Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్ భారత దేశం గురించి, హిందువుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సారి బత్తయిలను బత్తాయిలతోనే కొట్టాలి అంటూ విరుచుకు పడ్డాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇన్టా వీడియోలో తనకు రాత్రి కలలో ఆంజనేయ స్వామి కనిపించి వినాయకుడు తమ్ముడిని దగ్గర పెట్టుకో నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడన్నారు. బెట్టింగ్ మాఫియాను నిర్మూలించడంలో నీ కృషి చాలా ఉంది. అందుకు నీ కోసం కొంత మంది కాసుకుని కూర్చొన్నారు. కుమార స్వామిని తోడుగా ఉంచుకో అని అన్నారు. అంతే కాకుండా కాషాయం ముసుగులో కొందలు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నారని వారి అంతు కూడా తేల్చమని చేప్పాడన్నారు. అంతే కాకుండా 2026లో అసలు బూతులు ఆడనన్నారు. కొందరు దోపిడీ, దొంగతనలు చేసి జై శ్రీరామ్ అంటున్నారని విరుకుచు పడ్డారు. ఈ ఏడాది మొత్తం దుష్టులను దుర్మార్గులనూ అంతమెందించమని చెప్పారన్నారు. ముఖ్యంగా కాషాయం ముసుగులో ఉన్న బత్తాయిలకు తన వీడియో వస్తుందంటే వెన్నులో ఇణుకు పుట్టాలన్నారు. స్వామి మాల వేసుకుని మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. కరాటే కళ్యాణిని దృష్టిలో పెట్టుకుని అన్వేష్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read also-Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!
అంతే కాకుండా తనకు కలలో కనిపించిన ఆంజనేయ స్వామి ఇక ట్రావెలింగ్ కొన్ని రోజులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. అలా పోరాడితే రోజుకు రెండు కోట్లు వస్తాయి.. అందులో యాభై లక్షలు టాక్స్ కట్టినా కోటీ యాభై లక్షలు కూర్చొని సంపాదించు అని అన్నారన్నారు. ఇదిలా ఉండగా దేశ క్షేమం కోసం రోజుకు ఎనిమిది వీడియోలు చేసి దేశాన్ని రక్షించాలని హనుమాను చెప్పారన్నారు. దీనిని చూసిన కొందరు బీజేపీ కార్యకర్తలు అన్వేష్ పై మండిపగుతున్నారు. ఇప్పటికే అన్వేష్ దేశ ప్రజలను కించపరిచేలా, హిందూ దేవతలపై చేసిన వ్యఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలు, బీజేపా కార్యకర్తలు అన్వేష్ ను దేశం రప్పించి అరెస్టు చేయాలని కోరుతున్నాయి. ఇలాంటి సమయంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతటి దుమారం రేపుతాయే చూడాలి మరి.
Read also-The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..

