Sukumar: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 2000 వేల కోట్లను కలెక్ట్ చేసి రికార్డు క్రియోట్ చేసింది. అయితే, ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. వాటిలో సూసేకి పాట లో డాన్స్ మూమెంట్స్ అయితే అందర్ని ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే ఈ పాటకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ పాటను ఎవరూ కొరియోగ్రఫీ చేశారో ఇన్ని డేస్ వరకు బయటకు రాలేదు.
డైరెక్టర్ సుకుమార్ షాకింగ్ కామెంట్స్
ఈ సినిమాలోని సూసేకి పాటను శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ చేసినట్లు సినిమా డైరెక్టర్ సుకుమార్ అందరి ముందు చెప్పారు. ఇప్పటి వరకు ఈ మూవీలో అవకాశం జానీ మాస్టర్ ఇప్పించారనే అందరూ అనుకున్నారు. కానీ, ఈ ఒక్క మాటతో తేలిపోయింది. ఆమె టాలెంట్ తోనే సినిమాలో అవకాశం తెచ్చుకున్నట్లు గా అర్దమవుతుంది. డైరెక్టర్ సుకుమార్ ” సీతా పయనం ” టీజర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యరు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాలను బయటకు వెల్లడించారు.
Also Read: Ponnam Prabhakar: అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం!
సూసేకి పాట కొరియోగ్రఫీ చేసింది శ్రేష్టి వర్మ నా?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ” సాంగ్ విన్న తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఈ సాంగ్ ఎవరు చేశారని అడిగితే శ్రేష్టి వర్మ అని చెప్పారు. ఈ అమ్మాయి నా సినిమా పుష్ప 2 లో సుసేకి సాంగ్ అల్మోస్ట్ తనే కంపోజ్ చేసింది. చెప్పాలంటే పాటలో 80 % మూమెంట్స్ అన్ని తనవే.. చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా తనే కరెక్ట్ చేసింది. కాబట్టి ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వలేకపోయాము. ఆల్ ది బెస్ట్ శ్రేష్టీవర్మ .. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సాంగ్ నువ్వు చేసినందుకు అంటూ ” ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.