Sheep scam telangana
క్రైమ్

Hyderabad:గొర్రెల స్కాంపై రంగంలోకి ఈడీ

– తెలంగాణ స్కాములపై ఈడీ ఫోకస్
– సైలెంట్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నజర్
– కొత్తగా గొర్రెల స్కాం లెక్కలు తేల్చే పనిలో బిజీ
– మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ షురూ
– 700 కోట్ల అవినీతి గుర్తించిన ఏసీబీ
– పశుసంవర్ధక శాఖ ఎండీకి లేఖ రాసిన ఈడీ
– పూర్తి వివరాలు కావాలన్న అధికారులు
– ఏసీబీ దర్యాప్తు చేస్తుండగానే ఎంట్రీ ఇచ్చిన ఈడీ
– భారీగా డబ్బులు చేతులు మారడంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు
– ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ
– సెక్షన్ 54 పీఎంఎల్ఏ కింద పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు

Telangana Sheep scam enquiry began by Enforcement Directorete: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక స్కాములు వెలుగులోకి వచ్చాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాలకు వేదిక కాగా, ఇంకోవైపు గొర్రెల పంపిణీలో జరిగిన పెద్ద స్కాం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ రెండు కేసులకు సంబంధించి ఈడీ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సైలెంట్‌గా వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం ఉండగా, గొర్రెల స్కాం లెక్కలు తేల్చేందుకు ఇప్పటికే రంగంలోకి దిగింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది.

పశుసంవర్ధక శాఖకు లేఖ

పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కింద గొర్రెల స్కాంపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గెర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం లేఖ రాసింది. గొర్రెలు, మేకల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధకశాఖ విచారణ చేస్తుండగా, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

పూర్తిస్థాయి విచారణకు సిద్ధం

జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్దిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్దిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు? ఇలా 10 రకాల అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని లేఖలో పేర్కొంది.

నిందితులు మళ్లీ జైలుకు!

గొర్రెల పథకం కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితుల విచారణ ముగియడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు, అధికారులు అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో పది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్టయి జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌ నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌లను ఏసీబీ అధికారులు న్యాయస్థానం అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్‌లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు? తదితర వివరాలు రాబట్టేందుకు ఇద్దర్నీ మూడు రోజులపాటు విచారించారు. అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇలా ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, మూడు రోజులపాటు అనేక రకాలుగా ప్రశ్నించినా, నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. మూడు రోజుల గడువు ముగియడంతో అధికారులు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?