తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: ఉద్యోగం పేర బంగ్లాదేశ్ యువతిని మన దేశానికి తీసుకొచ్చి ఆమెతో బలవంతంగా వ్యభిచార కార్యకలాపాలు జరిపిస్తున్న ఇద్దరిని వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చెరలో ఉన్న యువతిని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లక్డీకాపూల్ లోని ది సెంట్ హోటల్ లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
ఓ గదిలో యువతితోపాటు ఉన్న ఘాన్సీబజార్ నివాసి సమీర్ మైటీని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని విచారించగా రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్ఆమెను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెస్ట్ బెంగాల్ కు తీసుకువచ్చినట్టు వెల్లడైంది. ఆ తరువాత ఆమె పేర ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను తయారు చేయించినట్టుగా తెలిసింది. అనంతరం ఢిల్లీ తీసుకెళ్లి బలవంతంగా వ్కభిచార కార్యకలాపాలు జరిపించినట్టుగా తెలిసింది.
Also Read: Sangareddy District Crime: దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం
ఆ తరువాత వేర్వేరు ఏజెంట్లు తనను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళుతూ ఇదే పని చేయిస్తూ వచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. కొన్ని రోజులుగా వెస్ట్ బెంగాల్కు చెంది చార్మినార్ ప్రాంతంలో ఉంటున్నకార్తిక్దాస్(29) తనతో వ్యభిచారం చేయిస్తున్నట్టు తెలియచేసింది. అతను ఏ హోటల్ కు వెళ్లమంటే తాను ఆ హోటల్ కు వెళుతూ వచ్చినట్టు చెప్పింది. ఈ క్రమంలో పోలీసులు కార్తిక్ దాస్ను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో కార్తిక్ దాస్ ఎప్పుడూ విటులను నేరుగా కలవలేదని వెల్లడైంది.
వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించి ఎవరైనా అమ్మాయి కావాలంటే ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్చేయించుకుని ఫలానా హోటల్ ఫలానా నెంబర్రూంకు వెళ్లండి అని మెసెజీలు పెట్టేవాడని తేలింది. కార్తిక్దాస్ తోపాటు సమీర్పై కేసులు నమోదు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇద్దరిని లక్డీకాపూల్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?