Crime News: గంజాయి పెడ్లర్ పై ఎక్సయిజ్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad) కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేటలో నివాసముంటున్న లఖన్ సింగ్(Lakhan Singh) కొన్నేళ్లుగా గంజాయి దందా చేస్తున్నాడు. ఒడిషా నుంచి 25 కిలోలు మొదలుకుని 100 కేజీల వరకు గంజాయి తెప్పిస్తూ లోకల్ పెడ్లర్లు, మత్తుకు అలవాటు పడ్డవారికి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్ట్ కూడా అయ్యాడు.
లఖన్ సింగ్ పై పీడీ యాక్ట్
గతంలో పోలీసులు ఒకసారి.. ఎక్సయిజ్ అధికారులు రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రకారం అతన్ని జైలుకు కూడా రిమాండ్ చేశారు. అయినా, లఖన్ సింగ్ తన ప్రవృత్తిని మార్చుకోలేదు. గడిచిన ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఒడిషా నుంచి 25, 27, 26 కిలోల గంజాయి తెప్పించి ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ అంజి రెడ్డి(CI Anji Reddy)కి పట్టుబడ్డాడు. ఈ క్రమంలో లఖన్ సింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించాలంటూ ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో కలెక్టర్ గంజాయి పెడ్లర్ లఖన్ సింగ్ పై పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Hrithik Roshan: గర్ల్ ఫ్రెండ్ను పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్.. ఎందుకంటే?
అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా
గతకొన్నిరోజుల క్రితం అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ ను హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితున్ని స్వదేశానికి పంపించే ప్రక్రియను పూర్తి చేశారు. అయితే డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన అలీ ఎనుకే ఫార్చునటస్ అకుడిన్వా ఎలియాస్ ఫార్చూన్ (30) తొమ్మిదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చాడు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు పబ్బుల్లో డీజేగా పని చేయటం మొదలు పెట్టాడు. అదే సమయంలో తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందా కూడా ప్రారంభించాడు. కాగా, లంగర్ హౌస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫార్చూన్ ను హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సీఐ బాలస్వామి ఎస్ఐ మనోజ్ కుమార్ తో కలిసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?