శేరిలింగంపల్లి స్వేచ్ఛ: Miyapur Crime: రోడ్డు పై వాకింగ్ చేస్తున్న వ్యక్తి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి జూవెనల్ హోమ్ కు తరలించారు. ఈనెల 23వ తేదీన రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయం లో ముగ్గురు మైనర్ బాలలు ద్విచక్ర వాహనంపై చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ సమీపరోడ్డులో వెళ్తున్నారు.
అదే రోడ్ లో నార్ని ఎస్టేట్ లెగ్జీరియో రెసిడెన్సి లో నివాసముంటున్న చోప్పారపు రాజా పూర్ణచందర్రావు వాకింగ్ చేసి వెళ్తుండగా వెనుక నుండి ముగ్గురు మైనర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి పూర్ణచందర్రావు మెడలో నుండి గొలుసును లాక్కుని పరారయ్యారు. దీంతో పూర్ణచందర్రావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
సి సి ఎస్, మియాపూర్ పోలీసుల సంయుక్తంగా విచారణ నిర్వహించారు. నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా చైన్ స్నాచింగ్ కు పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి వద్ద నుండి మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని వారిని జువైనాల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Hyderabad Crime: పసికందు చేసిన పాపమేమి? బిడ్డను బకెట్ లో ముంచి మరీ చంపిన తల్లి