Medchal Crime(Image CREDIT: twitter)
క్రైమ్

Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

Medchal Crime: అప్పు తగాదా హత్యకు దారి తీసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను పోలీసులు 24గంటల్లోనే అరెస్ట్ చేశారు. బాలానగర్(Balanagar) ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri District)ఎల్లమ్మబండ నివాసి, స్ర్కాప్​ వ్యాపారి అయిన సయ్యద్​ ఫాజెల్​ తన సోదరునితో కలిసి స్నేహితుడైన మహబూబ్​ కు అయిదేళ్ల క్రితం 11లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా మహబూబ్ అప్పుగా తీసుకున్న డబ్బు వాపస్ ఇవ్వలేదు.

 Also Read: Gadwal: నూతన రేషన్ కార్డులతో నెరవేరిన పేదల కల

పైగా డబ్బు కోసం ఒత్తిడి తెస్తే చంపేస్తానంటూ సయ్యద్ ఫాజెల్ ను బెదిరించాడు. ఈ క్రమంలో సయ్యద్ ఫాజెల్ తన మేనల్లుడు సయ్యద్ జహంగీర్, అతని స్నేహితులు షేక్ కరీం, షేక్ అమీర్ లతో కలిసి మహబూబ్ ను హత్య చేయాలని పథకం వేశాడు. దాని ప్రకారం  సాయంత్రం 4గంటలకు మహబూబ్ ను ఎల్లమ్మబండ ప్రాంతానికి రమ్మన్నాడు. ఈ క్రమంలో మహబూబ్​ ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. అంతా కలిసి గుడ్ విల్ రెస్టారెంట్ కు వెళ్లారు.

డబ్బు విషయమై గొడవ

అక్కడ మరోసారి సయ్యద్​ ఫాజెల్​, మహబూబ్ మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. దాంతో సయ్యద్​ ఫాజెల్​, సయ్యద్​ జహంగీర్​, షేక్​ కరీం, షేక్ అమీర్​ లు కలిసి కత్తులతో మహబూబ్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దాంతో మహబూబ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ(CI) నర్సింహ, డీఐ నరేంద్ర రెడ్డి, బాలానగర్(Balanagar) ఎస్వోటీ పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను ఆల్విన్ కాలనీలోని ఆర్​ఆర్​ఆర్​ వైన్స్ వద్ద అరెస్ట్ చేశారు.

 Also Read: CM Revanth protest: పేరు బంధంతో పాటు పేగు బంధం తెంచుకుందాం: రేవంత్ రెడ్డి

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?