Mahabubabad Murder (imagedrdit:canva)
క్రైమ్

Mahabubabad Murder: గిరిజన యువకుడు దారుణ హత్య.. కలకలం

ఏటూర్ నాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Murder: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్(28)ను గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో అతి దారుణంగా, అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడి చేసి హతమర్చారు.

ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది.

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ హత్య ఎందుకు చేశారు కుటుంబ కలహాలా ఆస్తి తగాదాల వివాహేతర సంబంధాల అనే పలు విధాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Also Read: Mujra Party: ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!