Mahabubabad Murder: గిరిజన యువకుడు దారుణ హత్య.. కలకలం
Mahabubabad Murder (imagedrdit:canva)
క్రైమ్

Mahabubabad Murder: గిరిజన యువకుడు దారుణ హత్య.. కలకలం

ఏటూర్ నాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Murder: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్(28)ను గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో అతి దారుణంగా, అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడి చేసి హతమర్చారు.

ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది.

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ హత్య ఎందుకు చేశారు కుటుంబ కలహాలా ఆస్తి తగాదాల వివాహేతర సంబంధాల అనే పలు విధాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Also Read: Mujra Party: ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే?

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!