Hyderabad (imagecredit:swetcha)
క్రైమ్

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నగలు చోరీ చేశారని మహిళ సూసైడ్!

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం పీఎస్ పరిధిలో చింతల్‌కుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించక పోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌ కుమార్‌తో కలిసి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ సుధేష్ణ చికిత్స పొందుతూ మరణించగా తన కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంగటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: CI Suspended: రక్షక భటుడు రాక్షసుడయ్యాడు.. మహిళపై సీఐ లైంగిక వేధింపులు!

సుధేష్ణఈ నెల 16న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్ణ ఇంట్లో దొంగలు చోరి చేశారు. సుధేష్ణకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి ఎంత వెతికిన దొరక్కపోవడంతో తను మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్‌లోని తన నివాసంలో మూడో అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. దీంతో వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడగా, ఏడు తులాల బంగారు నగలు పోయాయని సుధేష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Coronavirus Cases: కరోనాతో ఎలాంటి టెన్షన్ లేదు.. డాక్టర్ రవీంద్రనాయక్!

 

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?