Hyderabad (imagecredit:swetcha)
క్రైమ్

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నగలు చోరీ చేశారని మహిళ సూసైడ్!

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం పీఎస్ పరిధిలో చింతల్‌కుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించక పోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌ కుమార్‌తో కలిసి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ సుధేష్ణ చికిత్స పొందుతూ మరణించగా తన కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంగటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: CI Suspended: రక్షక భటుడు రాక్షసుడయ్యాడు.. మహిళపై సీఐ లైంగిక వేధింపులు!

సుధేష్ణఈ నెల 16న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్ణ ఇంట్లో దొంగలు చోరి చేశారు. సుధేష్ణకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి ఎంత వెతికిన దొరక్కపోవడంతో తను మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్‌లోని తన నివాసంలో మూడో అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. దీంతో వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడగా, ఏడు తులాల బంగారు నగలు పోయాయని సుధేష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Coronavirus Cases: కరోనాతో ఎలాంటి టెన్షన్ లేదు.. డాక్టర్ రవీంద్రనాయక్!

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు