Crime News | ఈ రోజుల్లో వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని దారుణాలు వెలుగు చూస్తున్నా సరే చాలా మంది అక్రమ సంబంధంను వీడట్లేదు. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం (illegal affair) పెట్టుకున్నాడని.. ఏకంగా చేతులు నరికేశాడు భర్త. నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మజ్జి ఏసురాజు (esuraju) హత్య కేసు ఏపీలో సంచలనం రేపింది. ఎందుకంటే అతని కుడిచేయిని నరకడంతో అతను చనిపోయాడు.
కానీ ఆ కుడి చేయి ఇన్ని రోజులుగా అస్సలు దొరకలేదు. దాంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అతన్ని ఎవరు చంపారా అని ఆరా తీయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసురాజు కొంత కాలంగా ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహిత భర్తకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించాడు. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని ఏసురాజుకు చాలా సార్లు చెప్పాడు. అయినా సరే ఏసురాజు వినకుండా అలాగే రెచ్చిపోయాడు.
శనివారం రాత్రి మండలంలోని ఓ గ్రామంలో తన భార్యతో ఏసురాజు ఉన్నాడని తెలుసుకుని.. ఆమె భర్త రగిలిపోయాడు. వెంటనే తన తండ్రికి ఈ విషయం చెప్పాడు. మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఏసురాజును బావాయిపాలెం తీసుకొచ్చారు. తన భార్యకు పదే పదే మెసేజ్ లు పంపుతున్నాడని ఏసురాజు కుడిచేతిని నరికి దూరంగా విసిరేశాడు ఆమె భర్త. ఆ తర్వాత ఏసురాజును కాపవరంలోని కాలువ వద్ద పడేసి ముగ్గురూ పారిపోయారు. చేతినుంచి విపరీతంగా రక్తం కారడంతో ఏసురాజు అక్కడే చనిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.