Crime News: నమ్మి పనిలో పెట్టుకుంటే కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు, నగదు కొల్లగొట్టి ఉడాయించిన నేపాలీ గ్యాంగ్ కోసం తూర్పు మండలం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డీసీపీ బాలస్వామి శనివారం ముఠా సభ్యుల ఫోటోలను విడుదల చేశారు. వారి గురించి తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. వివరాల్లోకి వెళితే…బాగ్ లింగంపల్లి నివాసి హేమరాజ్ వ్యాపారి. కొన్నిరోజుల క్రితం నేపాల్ దేశానికి చెందిన వారు ఆయన ఇంట్లో పనికి కుదిరారు.
ఇటీవల రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి హేమరాజ్ అతని భార్యకు ఇచ్చారు. అది తిని ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, 2 కోట్ల రూపాయల నగదుతో ఉడాయించారు. ఈ మేరకు కాచిగూడ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.
Also Read: GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువే!
అయితే, ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియలేదు. కాగా, గ్యాంగ్ సభ్యులు దేశ సరిహద్దులు దాటి నేపాల్ కు వెళ్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు దేశవ్యాప్తంగా వీరిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ముఠా సభ్యుల గురించి తెలిస్తే 8712660501, 8712660503, 8712660506, 8712660509, 8712660540, 8712660541 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/