Pan India Tapping Joint Leaders Came To Light
క్రైమ్

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 90 రోజులు గడిచినా చార్జిషీట్ వేయలేదని, కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. పోలీసులు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసినా.. మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పించలేదనే కారణంతో కోర్టు చార్జిషీట్‌ను వెనక్కి పంపింది. ఈ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ పై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం కీలక పరిణామం జరిగింది. పోలీసులు ఈ కేసులో ఎవిడెన్స్ మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించారు.

మూడు బాక్స్‌లలో ఈ ఆధారాలను కోర్టుకు పోలీసులు సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, సీడీ, పెన్ డ్రైవ్‌లు ఇందులో ఉన్నాయి. అన్నిటినీ జతపరుస్తూ పోలీసులు మూడో సారి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ ఎవిడెన్స్ నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం