Drugs Crime: డ్రగ్ రాకెట్లో కానిస్టేబులే సూత్రధారి.
Drugs Crime (imagecredit:swetcha)
క్రైమ్

Drugs Crime: డ్రగ్ రాకెట్లో కానిస్టేబులే సూత్రధారి.. గ్యాంగ్ సభ్యుల ద్వారా డ్రగ్స్​దందా!

Drugs Crime: కూకట్ పల్లి ప్రాంతంలో పట్టుబడ్డ డ్రగ్ రాకెట్ లో కానిస్టేబులే ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ అయ్యింది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అతనే గ్యాంగ్ సభ్యుల ద్వారా డ్రగ్స్​దందా నడిపిస్తున్నట్టు తేలింది. బాలానగర్ జోన్ ఇన్​ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్​తో కలిసి వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన గుణశేఖర్ ఆర్మ్ డ్ రిజర్వడ్ కానిస్టేబుల్. గతంలో ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ వద్ద గన్ మెన్ గా పని చేశాడు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణశేఖర్​ తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్​దందా మొదలు పెట్టాడు.

కొకైన్​మిక్స్ డ్ ఎఫిడ్రిన్ డ్రగ్

బెంగళూరుకు చెందిన అప్పన్న నుంచి కొకైన్​మిక్స్ డ్ ఎఫిడ్రిన్ డ్రగ్ ను తీసుకు వచ్చి ఆంధ్రప్రదేశ్​లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న ఉన్నం సురేంద్ర (31), దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి (38), చేగూడి మెర్సీ మార్గరెట్ (34), షేక్ మస్తాన్ వలీ (40), దేవరాజు యేసుబాబు (29)తో కలిసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు వెళ్లి అప్పన్న నుంచి కోటి రూపాయల విలువ చేసే డ్రగ్ తీసుకుని తిరుపతికి వచ్చాడు. దీనిని సురేంద్ర తీసుకుని గుంటూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే గ్యాంగ్ లోని మిగితా సభ్యులు కూకట్ పల్లి జయనగర్​ ప్రాంతంలో ఉన్నారు. అంతా కలిసి భాగ్యనగర్ వైపు వెళుతుండగా ఎస్వోటీ అధికారులు కూకట్ పల్లి పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్ ను సీజ్ చేశారు. కానిస్టేబుల్​ గుణశేఖర్, అప్పన్నలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.

Also Read: KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!

 

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!