brs mlc kavitha judicial custody extended in delhi liquor policy case ఊరట లేదు.. కవితకు కస్టడీ పొడిగింపు
MLC Kavitha To Stay In Jail Custody Extended By 14 Days
క్రైమ్

MLC Kavitha: ఊరట లేదు.. కవితకు కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కడం లేదు. బెయిల్ పిటిషన్ పై దరఖాస్తులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జ్యుడీషియల్ కస్టడీ గడువు మాత్రం పెరుగుతూనే ఉన్నది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమె కస్టడీని పొడిగించింది. మరో 14 రోజులపాటు ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. అంటే జూన్ 3వ తేదీ వరకు ఆమె తిహార్‌లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సి ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు వేయగా.. న్యాయమూర్తి కావేరి బవేజా డిస్మిస్ చేశారు. కాగా, రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. కవిత్ బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇది వరకే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి దీనిపై స్పందించాలని మే 10వ తేదీన ఈడీకి హైకోర్టు నోటీసులు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ పై తదుపరిగా మే 24వ తేదీన విచారణ జరపనుంది.

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌పై తిహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి