Fire Accident
క్రైమ్

Fire Accident : అగ్నిప్రమాదంలో పాప, ఇద్దరు మహిళల మృతి..

Fire Accident : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలం పుప్పాలగూడలోని ఓ బిల్డింగ్ లో సడెన్ గా మంటలు చెలరేగాయి. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో సడెన్ గా మంటలు చెలరేగాయి. దాంతో దట్టమైన పొగ, మంటలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందు మొదటి అంతస్తులో చిక్కుకున్న ఒక పాప, ఇద్దరు మహిళలను బయటకు తీసుకొచ్చారు.

అప్పటికే పొగ బాగా కమ్మేయడంతో వారిని స్ట్రెచర్ మీద స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సిజిరా(7), సహానా(40), జమీలా(70) ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సడెన్ గా మంటలు రావడంతో అవి కాస్త బిల్డింగ్ మొత్తం వ్యాపించాయని.. ఇంట్లో ఉన్న మూడు సిలిండర్లు పేలడంతో తీవ్రత పెరిగినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురిని కాపాడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?