Encounter In Chhattisgarh, Six Naxals Killed
క్రైమ్

Encounter: ఛత్తీస్‌గడ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో పెడియా అడవుల్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలై సుమారు 11 గంటలపాటు ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఛత్తీస్‌గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సైనికులు గొప్ప విజయం సాధించారని ప్రకటించారు.

మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందడంతో సుమారు 1200 మంది డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పెడియా అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. సుమారు 11 గంటలపాటు ఈ కాల్పులు జరిగాయి. బస్తర్ ఐజీ, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఈ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!