చంద్రబాబుపై పిటిషన్... పనికిమాలిన పిటిషనంటూ కొట్టేసిన సుప్రీం
CM Chandrababu Naidu
అమరావతి, ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుపై పిటిషన్… పనికిమాలిన పిటిషనంటూ కొట్టేసిన సుప్రీం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ వేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ పై సుప్రీమ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానించిన జస్టిస్‌ బేలా త్రివేది.. పిటిషన్ ని కొట్టేశారు. కాగా, చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన ఏడు కేసులు సిబిఐకి బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటిషన్‌ దాఖలు చేశారు.

బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ సిద్ధమవగా… ఆయనపై జస్టిస్ బేలా త్రివేది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తాము అని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ బాలచంద్ర వరాలే ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా వినకుండానే ధర్మాసనం పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Just In

01

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?