Tirupati: రైలు ప్రయాణికులు ఎగిరి గంతేసే న్యూస్..
Tirupati ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Tirupati: రైలు ప్రయాణికులు ఎగిరి గంతేసే న్యూస్.. తిరుపతికి అదనపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు!

Tirupati: పండుగలు, పుణ్యక్షేత్ర యాత్రల సీజన్‌లో భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ రైల్వే అధికారులు రామేశ్వరం-తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్లు డిసెంబర్ 2 నుంచి 9 వరకు రామేశ్వరం నుంచి తిరుపతి వైపు, డిసెంబర్ 3 నుంచి 10 వరకు తిరుపతి నుంచి రామేశ్వరం వైపు నడుస్తాయి.

రైలు వివరాలు

రైలు నం. 06080 (రామేశ్వరం – తిరుపతి)

బయలుదేరే సమయం: సాయంత్రం 4:30 గంటలు
తిరుపతి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 10:10 గంటలు

Also Read: Gram Panchayat Election 2025: మా బతుకులు మారట్లేదు.. 15 ఏళ్లుగా రోడ్డుకే దిక్కులేదంటూ.. సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ

రైలు నం. 06079 (తిరుపతి – రామేశ్వరం)

బయలుదేరే సమయం: మధ్యాహ్నం 11:55 గంటలు
రామేశ్వరం చేరే సమయం: మరుసటి రోజు తెల్లవారుజామున 4:45 గంటలు

Also Read: CS Ramakrishna Rao: గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఎస్.. భారీగా ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం

ఎక్కువ సామర్థ్యం.. మరింత సౌకర్యం

రెండు రైళ్లకు 18 కోచ్‌లు జత చేశారు. సాధారణ రైళ్ల కంటే ఎక్కువ సీట్లతో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన యాత్ర అందించడమే లక్ష్యం. కుటుంబాలు, సమూహ యాత్రికులు, ఒంటరి ప్రయాణికులు సైతం సౌకర్యంగా ప్రయాణించేలా ఈ ఏర్పాటు చేశారు.

మార్గమధ్యంలో ఆగే స్టేషన్లు ఇవే.. 

మండపం, రామనాథపురం, పరమకుడి, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచ్చి, తంజావూరు, పాపనాసం, కుంభకోణం, మయిలాడుతురై, సీర్కాళి, చిదంబరం, కడలూరు పోర్ట్, విలుప్పురం, తిరువణ్ణామలై, ఆరణి రోడ్, వేలూరు కంటోన్మెంట్, కాట్పాడి, పాకాల స్టేషన్ల వద్ద ఈ రైళ్లు ఆగుతాయి.

Also Read: Nitish Kumar Reddy: తొలి వన్డేలో నితీష్ రెడ్డిని ఎందుకు ఆడించలేదు?.. జట్టు కూర్పుపై మాజీ దిగ్గజం తీవ్ర విమర్శలు

టికెట్ల రిజర్వేషన్..  ముందస్తు బుకింగ్ తప్పనిసరి

పండుగలు, యాత్రల సీజన్ కావడంతో ఈ ప్రత్యేక రైళ్లు త్వరగానే నిండిపోతాయని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.దక్షిణ రైల్వే ఈ చొరవతో వేలాది మంది భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించనుంది. రామేశ్వరం, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపశమనం కలిగించనున్నాయి.

Just In

01

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?