Modi and Chandrababu Meeting
ఆంధ్రప్రదేశ్

Modi and Chandrababu: అమరావతి పునఃప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం

Modi and Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసి, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇది ‘పిరికిపంద చర్య’గా చంద్రబాబు అభివర్ణించారు. ‘మేము మీతో ఉన్నాము, దేశ ప్రయోజనాల కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయంలోనైనా దేశం మొత్తం మీతో నిలుస్తుంది’ అని ప్రధానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో దేశాన్ని నడిపించడానికి మోడీ బలమైన, స్థిరమైన నాయకత్వంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read- S Thaman: నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదు.. థమన్ ఎమోషనల్ స్పీచ్!

ఇంకా ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి నిరంతరం మద్దతు ఇచ్చినందుకు ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, కొనసాగుతున్న పనుల గురించి ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో బిపిసిఎల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మంజూరును పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు, ఆరామ్‌కో భాగస్వామ్యాన్ని త్వరగా పూర్తి చేయడం వల్ల ప్రాజెక్టుకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎన్‌టిపిసి విస్తరణ, ఆర్సెలర్‌మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులను సులభతరం చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చురుకైన సహాయాన్ని చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానమంత్రి పాత్రను చంద్రబాబు కొనియాడారు.

దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ఏపీకి చెందిన అనేక విషయాల గురించి మోదీ అడగగా, ఆ అంశాలతో పాటు చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితి, పెండింగ్ అంశాలను ఈ భేటీలో తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. అనంతరం మే 2వ తేదీన అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధానిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మే 2న జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు రూ. లక్ష కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధానితో శంకుస్థాపన చేయించేలా ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో బాలీవుడ్ హీరోయిన్? ఇది మామూలు ట్విస్ట్ కాదు భయ్యా!

దాదాపు 5 లక్షల మంది ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసింది. అలాగే, ఈ ప్రారంభోత్సవం అనంతరం శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. ఏపీకి సంబంధించి చెప్పిన అన్ని విషయాలను, సమస్యలను ఎంతో శ్రద్ధగా విన్న ప్రధానికి చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు. కాగా, అమరావతి పున:ప్రారంభోత్సవం అనంతరం మోదీ రోడ్ షో ఉంటుందని, దాదాపు 30 వేల మంది ఈ షోలో పాల్గొననున్నారని సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది