Massive Explosion: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు
Massive explosion (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Massive Explosion: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Massive Explosion: ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రాయవరంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కొమరిపాలెంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ (బాణసంచా తయారీ పరిశ్రమ)లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రుల మధ్య సయోధ్య.. విభేదాలను చక్కదిద్దిన టీపీసీసీ.. వివాదం ముగిసినట్లే!

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకుంది. బాణాసంచా పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 40 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.

బాణాసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల చికిత్స విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

Also Read: BSNL Rs 225 Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ.225కే రోజూ 2.5 జీబీ డేటా.. 350కిపైగా లైవ్ ఛానల్స్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..