Adavi Thalli Bata(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Adavi Thalli Bata: అడవి బాట పట్టిన పవనన్న.. కారణం ఇదేనా?

Adavi Thalli Bata: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడబోతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు పవన్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్ చేరుకుంటారు.

పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతోపాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8న ఉదయం అరకు మండలం, సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు.

Also read: Telangana : బీజేపీ నేతలకు కొత్త ట్విస్ట్.. కేసులుంటేనే లీడర్స్? 

అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ