YCP Office
అమరావతి, ఆంధ్రప్రదేశ్

YCP Office | వైసీపీ కార్యాలయానికి నోటీసులు

YCP Office | ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయానికి అమరావతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న ఆఫీసుకి సమీపంలో ఉన్న గార్డెన్​ లో మంటలు వ్యాపించిన ఘటనపై విచారణలో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలని అందులో
పేర్కొన్నారు. కాగా, మంటలు వ్యాపించడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్​ నివాసం పక్కనే వైసీపీ కేంద్ర కార్యాలయం (YCP Office) ఉంటుంది. దానికి ఎదురుగా గార్డెన్​ ఉంటుంది. గత బుధవారం ఈ గార్డెన్​ వద్ద మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేక దీని వెనుక కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించనున్నారు.

మరోవైపు మంటలు చెలరేగిన ఘటనపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనకు కారకులైన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా జగన్​ నివాసం, వైసీపీ ఆఫీసు వద్ద భద్రతను పెంచాలని డిమాండ్​ చేసింది. ఇదిలావుంటే… వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం సిట్​ దర్యాప్తునకు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?