cbn
ఆంధ్రప్రదేశ్

CM CHANDRABABU NAIDU: ఢిల్లీని తాకిన మిర్చి ఘాటు

అమరావతి, స్వేచ్ఛ: మిర్చి ధరల విషయంలో ఓవైపు పొలిటికల్ హీట్ నడుస్తుండగా, ఇంకోవైపు సీఎం చంద్రబాబు (Cm Chandrababu Naidu) కేంద్రానికి (Central Govt) లేఖ రాశారు. ఏపీలో మిర్చి (Mirchi) రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని చెప్పారు. పీడీపీ(ప్రైస్ డెఫిసియన్సీ పేమెంట్) (Pdp) కింద చెల్లింపులు చేయాలని కోరారు. మిర్చి రైతులు నష్టపోతున్న వంద శాతం ధరను చెల్లించాలని, ఈ విషయంలో ఏపీ రైతులను ప్రత్యేక కేసుగా గుర్తించాలని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డులో స్పెషల్ వెరైటీ క్వింటాలు ధర రూ.13,600గానూ కామన్ వెరైటీ ధర రూ.11,500గా ఉందన్న సీఎం, 2023-24లో క్వింటాలు ధర రూ.20 వేల వరకూ పలికిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 11,67,110 మెట్రిక్ టన్నుల మేర మిర్చి ఉత్పత్తి అయ్యే అవకాశముందని వివరించారు. ఎగుమతులు నిలిచిపోవటంతో ధరల్లో ఇబ్బంది వచ్చిందని, వర్షం కారణంగా పంట దెబ్బతిన్నదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి

TDP vs YCP: పొలిటికల్ ఘాటు ; మిర్చి రేటుపై వైసీపీ, టీడీపీ మైలేజ్ ఫైట్

Ys Jagan | ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు తప్పదా..?

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు