Nirmala | విభజన తర్వాతే తెలంగాణ అప్పుల పాలైంది..
Nirmala Seetharaman
జాతీయం

Nirmala Seetharaman | విభజన తర్వాతే తెలంగాణ అప్పుల పాలైంది : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మొన్న బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రం విభజనకు ముందు మిగులు బడ్జెట్ తో ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతనే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. దానికి కేంద్రానికి సంబంధం లేదు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు’ అంటూ ఆమె తెలిపారు.

చాలా సార్లు కేంద్రమే తెలంగాణకు అడిగిన దానికన్నా నిధులు ఎక్కువగా కేటాయించినట్టు ఆమె వివరించారు. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి తెలిపారు. 2025 బడ్జెట్ లో ఏపీకి, బీహార్ కు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. గతంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు.

Just In

01

Ramchander Rao: బీజేపీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపితే తాట తీస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?