Nirmala Seetharaman
జాతీయం

Nirmala Seetharaman | విభజన తర్వాతే తెలంగాణ అప్పుల పాలైంది : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మొన్న బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రం విభజనకు ముందు మిగులు బడ్జెట్ తో ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతనే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. దానికి కేంద్రానికి సంబంధం లేదు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు’ అంటూ ఆమె తెలిపారు.

చాలా సార్లు కేంద్రమే తెలంగాణకు అడిగిన దానికన్నా నిధులు ఎక్కువగా కేటాయించినట్టు ఆమె వివరించారు. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి తెలిపారు. 2025 బడ్జెట్ లో ఏపీకి, బీహార్ కు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. గతంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు.

Just In

01

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!