YCP Office
అమరావతి, ఆంధ్రప్రదేశ్

YCP Office | వైసీపీ కార్యాలయానికి నోటీసులు

YCP Office | ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయానికి అమరావతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న ఆఫీసుకి సమీపంలో ఉన్న గార్డెన్​ లో మంటలు వ్యాపించిన ఘటనపై విచారణలో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలని అందులో
పేర్కొన్నారు. కాగా, మంటలు వ్యాపించడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్​ నివాసం పక్కనే వైసీపీ కేంద్ర కార్యాలయం (YCP Office) ఉంటుంది. దానికి ఎదురుగా గార్డెన్​ ఉంటుంది. గత బుధవారం ఈ గార్డెన్​ వద్ద మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేక దీని వెనుక కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించనున్నారు.

మరోవైపు మంటలు చెలరేగిన ఘటనపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనకు కారకులైన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా జగన్​ నివాసం, వైసీపీ ఆఫీసు వద్ద భద్రతను పెంచాలని డిమాండ్​ చేసింది. ఇదిలావుంటే… వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం సిట్​ దర్యాప్తునకు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ