Jupally Krishna Rao: సింగోటం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
Jupally Krishna Rao (imagecredit:swetcha)
Telangana News, మహబూబ్ నగర్

Jupally Krishna Rao: భక్తులకు గుడ్ న్యూస్.. సింగోటం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు ఆదేశించారు. ముందుగా మంత్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వాదములను అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సింగోటం శ్రీలక్ష్మీనరసిహాస్వామి ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధిక సంఖ్యలో వచ్చే అవకాశం

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..‌‌ ఈనెల 15 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీస్ శాఖాధికారులను ఆదేశించారు. జాతరలో తాగునీటి, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం వంటి ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని దీనిని దృష్టిలో, జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుగంగా వ్యవహరించాలని ఏమాత్రం లోటుపాట్లు, పొరపాట్లు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు.జాతరకు తరలి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా జాతరలో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), సూచించారు. మంత్రి ఆలయ ఆదాయం ఖర్చులపై సమీక్షించారు. ఆలయానికి నిధులు పెంపొందించే విధంగా ఆలయం సంబంధించిన అన్ని పనుల టెండర్లను ఆన్‌లైన్ లో నిర్వహించాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!

3 లక్షల మంది భక్తులు

అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. రాయలసీమ భక్తుల కోసం నందికొట్కూర్ కర్నూలు నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే సోమశిల, మంచాలకట్ట వద్ద టూరిజం శాఖకు చెందిన చిన్న బోట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రథోత్సవం రోజున ప్రతి గ్రామం నుంచి బస్సు నడపాలని.. కొల్లాపూర్ డిపో నుంచేగాక ఇతర ప్రాంతాల నుంచి అదనపు బస్సులు తెప్పించాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జాతర మైదానంలో ఉన్న ముళ్లపొదలను తొలగించి శుభ్రం చేయాలని, గుండంలోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని చెప్పారు. కట్టపైన, కిందిభాగంలో విద్యుద్దీపాలను సమకూర్చాలని, జాతరలోని గుడారాల నిర్వహణను గ్రామపంచాయతీ సిబ్బంది చూసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. గుట్కా, గంజాయి తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు.తీరు రోజు అత్యధిక శాతం భక్తులు దర్శించుకుంటారని, అందుకు తగ్గట్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా తేరు జరిగే సందర్భంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు చైన్ స్కెచ్చర్స్ వంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిగా ఉంచాలని, సూచించారు. టూరిజం నుంచి ప్రత్యేకంగా ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

జాతర జరిగే రోజులు సంస్కృతిక శాఖ నుంచి కళాకారులను రాష్ట్రస్థాయి నుంచి కళాకారులను ఏర్పాటుచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… సింగోటం జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జాతర రోజుల్లో ఆలయం వద్ద వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జాతరలో భక్తులకు నీటి సౌకర్యం ఉండేలా ఆయా చోట్ల తాగునీటి వసతి కల్పించాలని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతర సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ భక్తులకు అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో.. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్ రావు, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, డి.ఎస్.పి శ్రీనివాసులు, ఈవో రంగారావు, సింగోటం సర్పంచ్ ఆదిరాల యాదయ్య గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు శ్రీరాములు, ఉమా శంకర్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?