Bribe Case: ఓ ప్రైవేటు వ్యక్తి కూడా అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అధికారికంగా సాయ పడేందుకు లంచం తీసుకున్న ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులతోపాటు వారికి సహకరించిన ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ ((Bribe Case) చేశారు. నిందితుల నుంచి లంచంగా తీసుకున్న రూ.3.51 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగూడెం ఆఫీస్లో తాటి శ్రావణి డివిజనల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాడి రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెం సబ్ డివిజనల్ ఆఫీస్లో ప్లాంటేషన్ మేనేజర్గా పని చేస్తున్నాడు. అయితే, ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనల మేరకు కాంట్రాక్ట్ దక్కించుకొని, 3,900 టన్నుల బరువు ఉన్న యూకలిప్టస్ చెట్లను నరికే పనులు పూర్తి చేశాడు. దీనికి సంబంధించి అతనికి బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. దీనిపై శ్రావణి, రాజేందర్లను సంప్రదించడగా ఇద్దరూ లంచం డిమాండ్ చేశారు.
Read Also- Doctors Recruitment: గుడ్న్యూస్… త్వరలోనే డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
ఖమ్మం టౌన్ లో తమ వ్యక్తి జోగు చెన్నారావు ఉంటాడని, అతనికి డబ్బు అంద చేయాలని చెప్పారు. ఆ తరువాతే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. దాంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వల పన్నిన ఏసీబీ అధికారులు శనివారం జోగు చెన్నారావు లంచం నగదు తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో శ్రావణి, రాజేందర్ సూచనల మేరకే ఆ డబ్బు తీసుకున్నట్టు చెన్నారావు అంగీకరించడంతో ఆ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. అధికారికంగా సహాయ పడేందుకు ఎవ్వరూ లంచం డిమాండ్ చేసినా 1064 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Read Also- Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?

