electric passenger auto
నార్త్ తెలంగాణ

ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో దగ్ధం

నిజామాబాద్, స్వేచ్ఛ : నిజామాబాద్ లో ఇంటి ముందర పార్క్ చేసిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో (Electric Passenger Auto) దగ్ధమైన ఘటన బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఎండీ ముసొద్దీన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆయన బుధవారం రాత్రి ఇంటి ముందు ఆటో నిలిపి చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ పెట్టిన కొద్ది సమయానికి ఆటోలోంచి మంటలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆటో యజమాని బయటికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటో దగ్ధానికి బ్యాటరీ ఓవర్ చార్జింగ్ కావడమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది.

 

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..