BJP Shantha Kumar
నార్త్ తెలంగాణ

BJP | బీసీలను వంచించే కుట్ర -శాంత కుమార్

మహబూబ్‌నగర్, స్వేచ్ఛ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కుల గణన నివేదిక‌తో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచించే కుట్ర చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా‌తో ఆయన మాట్లాడారు. 3 కోట్ల 92 లక్షల జనాభా ఉన్న బీసీలను 3కోట్ల 50 లక్షలు గా తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేసామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ నివేదికను బహిర్గతం చేశారని శాంత కుమార్ అన్నారు. బీసీ కులగణన నివేదిక బాధ్యతను పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకులకు ఇవ్వకుండా అగ్ర కులస్తుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలా ఇస్తారన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చు గట్ల అంజయ్య, నాయకులు నంబిరాజు తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు