Ranga Reddy District: భూమి ఎవరిది అనేది పక్కకు పెడితే బల నిరూపణతో ఆక్రమించుకోవాలనే లక్ష్యంగానే రియల్ వ్యాపారం నడుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో భూమి విలువ పెరిగిపోవడంతో నిబంధనలకు అనుగుణంగా రియల్ వ్యాపారం చేస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో పక్కవాడిపై దౌర్జన్యం చేస్తే అందినకాడికి దండుకోవచ్చు అనే విధంగా జిల్లాలో కొంత మంది రియల్ వ్యాపారం నడిపిస్తున్నారు.ఫైనాన్షియల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో భూమి భారీగా రెక్కలు రావడంతో గుంట భూమి కూడా విలువైనది. ఆ ప్రాంతంలోని భూ యాజమాన్యులు నేడు రోజువారి కూలీలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వారికి మిగిలిన భూమిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ పరిధితోగానీ, సర్వే నెంబర్లతో సంబంధం లేదు. కానీ ఆ భూమిని ఏలాగైన దక్కించుకోవాలని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ రాత్రికి రాత్రి భౌంసర్ల సహాయంతో కబ్జా చేయడం దారుణం.
భూ బాగోతం ఇదీ
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 300లో నాగుల కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అవసరాల నిమ్మిత్తం 2000 సంవత్సరంలో దాదాపు విక్రయించడం జరిగింది. ఓఆర్ఆర్కు సైతం 7 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయం చేసే సందర్భంలో పోలాలకు వెళ్లేందుకు రోడ్డు కోసం వదిలిన 31 గుంటల భూమి ఇప్పటికి మిగిలిపోయిందని భాధితులు వివరిస్తున్నారు. ఈ భూమి పక్కనే నార్సింగ్ మున్సిపాలిటీకి చెందిన మణికొండ రెవెన్యూకి చెందిన 90 సర్వే నెంబర్ ఉంది. మణికొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 90లో సైబర్ సిటీ వెస్ట్ బ్రో కంపెనీ అపార్ట్మెంట్లు నిర్మాణం చేసింది. ఇందులోని ఫ్లాట్లు విక్రయం జరిగేందుకు సరియైన రోడ్డు మార్గం లేదు. ఆ మార్గం కోసం పుప్పల్ గూడ రెవెన్యూ పరిధిలో ఖాళీగా ఉన్న 300 సర్వే నెంబర్లోని 31 గుంటల భూమిని కబ్జా చేసుకోని రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరిగింది. 31 గుంటల భూమిపై 49 మంది కుటుంబ సభ్యులు ఆశతో బ్రతుకుతున్నారు. ఈ పేదలను మోసం చేసేందుకు సదురు కాంట్రాక్టర్ ఆస్ర్తశాస్త్రాలను వినియోగిస్తున్నారు.
Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!
పోలీసులను సైతం లెక్కచేయని వైనం
ప్రభుత్వానికి దగ్గరగా, అధికారులను ప్రభావితం చేయగలిగే వ్యక్తులే కబ్జాలకు పాల్పడుతున్నారనే ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే సైబర్ సిటీ వేస్ట్ బ్రో కంపెనీ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన స్థల యజమాన్యంతో రియల్ ఏస్టేట్ వ్యాపారులు సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని తెలికగా తీసుకోని భూ యజమాన్యులను రియల్ వ్యాపారులు బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ఆంతర్యాం ఏమీటనే విషయం తెలియడం లేదు. భూ భాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు స్వీకరించినప్పటికి రియల్ వ్యాపారులు లెక్కలేని విధంగా దురుసుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రియల్ వ్యాపారులు ప్రైవేట్ సైన్యంతో భాధితులను భయాబ్రాంతులకు గురిచేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలొ నాగుల ప్యామీలి పేరుతో ఉన్న సూచిక బోర్డును సైతం తొలగించి, దౌర్జన్యం చేస్తున్నారు.
Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

