Drishyam 3: ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది
Drishyam 3 Announcement (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Drishyam 3: మళ్ళీ వస్తున్న విజయ్ సల్గాంకర్.. ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది

Drishyam 3: గత పదేళ్లుగా భారతీయ సినీ ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్న ‘దృశ్యం’ (Drishyam) సిరీస్ నుండి మూడవ భాగం రాబోతోంది. అజయ్ దేవగన్ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దృశ్యం 3’ (Drishyam 3) మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సంచలన విజయం సాధించిన అనంతరం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. జీతూ జోసెఫ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. అందరికీ థ్రిల్ ఇచ్చి, సంచలన విజయాన్ని నమోదు చేసింది. మిగతా భాషల్లో కూడా ఈ ఈ సినిమా అలాంటి మ్యాజిక్కే క్రియేట్ చేసింది. ఇప్పుడీ సీక్వెల్ పరంపరలో భాగంగా హిందీలో కూడా 3వ పార్ట్ రాబోతోంది. అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ వీడియోను గమనిస్తే..

Also Read- Sai Kumar: ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం

కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు

అజయ్ దేవగన్ (విజయ్ సల్గాంకర్) తన గంభీరమైన వాయిస్‌తో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. లోకం తనను నేరస్థుడు, హంతకుడు, ఫరేబి, మోసగాడు అని పిలిచినా తనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. గడిచిన ఏడేళ్లలో తాను చూసింది, చేసింది అంతా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికేనని ఆయన వివరించారు. ‘ప్రతి ఒక్కరికీ ఒక సత్యం ఉంటుంది, నా సత్యం నా కుటుంబం మాత్రమే’ అని పేర్కొంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ముగింపు ఇంకా మిగిలే ఉంది! కథ ఇంకా ముగియలేదని, అసలైన పార్ట్ ఇంకా మిగిలే ఉందని తెలుపుతూ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. విజయ్ సల్గాంకర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక రక్షణ గోడలా మళ్ళీ ఎలా నిలబడతాడో, ఈసారి ఎలాంటి థ్రిల్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే మాత్రం రాబోయే గాంధీ జయంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Bigg Boss Buzzz: బిగ్ బాస్ బజ్‌లో తన తదుపరి లక్ష్యమేంటో చెప్పేసిన కళ్యాణ్.. ఏంటంటే?

రిలీజ్ డేట్ ఫిక్స్

అవును ఈ చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ఈ అనౌన్స్‌మెంట్‌లో తెలియజేశారు. 2 అక్టోబర్, 2026న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీకి ఉన్న విశిష్టత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డేట్‌ని సెలక్ట్ చేసుకోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే మాత్రం విడుదల తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతేకాదు, ఇదే చివరి పార్ట్ అని కూడా మేకర్స్ తెలపడం విశేషం. అజయ్ దేవగన్, టబు (Tabu), శ్రియా శరణ్ (Shriya Saran) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) దర్శకత్వంలో కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?