Jagan Birthday Cutout: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన విపక్షాలుగా ఉన్న ఇటు బీఆర్ఎస్ (BRS).. అటు వైఎస్సార్సీపీ (YSRCP) మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. ఎన్నికల్లో కలిసి పనిచేయకపోయినా, ప్రత్యక్ష రాజకీయ సంబంధాలు లేకపోయినా, బలమైన బంధమేదో ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతుందనేది బహిరంగ రహస్యమే. ఇరుపార్టీలు పరస్పరం సాఫ్ట్ కార్నర్తో సహకరించుకుంటున్నాయని ప్రత్యర్థ పార్టీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇటీవలే వైసీపీ అధినేత, ఏపీ మాజీ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇద్దరూ బెంగళూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్న ఫొటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ భేటీని తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనించాయి. ఇలా ఆ రెండు పార్టీల మధ్య సఖ్యతను చాటి చెప్పే సందర్భాలు గతంలోనూ జరిగాయి. అయితే, ఆ స్థాయిలో కాకపోయినా, తాజాగా అలాంటి సాక్ష్యం మరొకటి వెలుగుచూసినట్టుగా అనిపిస్తోంది.
Read Also- MLC Balmoor Venkat: హుజూరాబాద్ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: బల్మూర్ వెంకట్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) నాడు 53వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రెండు రోజుల ముందుగానే ఆయన అభిమానుల్లో కోలాహలం మొదలైంది. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందు అభిమానులు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు కట్టారు. అయితే, అందులో ఒక కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షులు చెబుతూ వెలసిన ఆ పోస్టర్పై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల ఫోటోలు (Jagan Birthday Cutout) ఉన్నాయి. అవి కూడా పెద్ద సైజులో ఉండడంతో జనాల కంటపడుతున్నాయి. ఈ కటౌట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శేరిలింగంపల్లికి చెందిన రవీందర్ యాదవ్ ఈ కటౌట్ పెట్టించినట్టుగా ఉంది.
Read Also- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై వేటుకు రంగం సిద్ధం?.. అదే చివరిది!
కాగా, ఫోటోపై వైసీపీ, బీఆర్ఎస్ అభిమానుల ‘పిక్ అదుర్స్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో చూస్తే కొందరికి చెమటలు పడతాయంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా, ప్రత్యర్థి పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. ‘మేము సింగిల్.. సింహాలం అని చెప్పుకునే వాళ్ల మధ్య ఈ డీలింగ్స్ ఏంటో’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులిచ్చి కట్టించుకున్నారేమోనంటూ కొందరు ఫన్నీ కామెంట్లు పెట్టారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల సోషల్ మీడియా సర్కిల్స్ను ఆ ఫొటో ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కామన్ ఎనిమీ సిద్ధాంతం
కాగా, వైసీపీ-బీఆర్ఎస్ మధ్య రాజకీయ మితృత్వానికి కారణాలు ఉన్ానయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ఈ రెండు పార్టీల బంధానికి అతికినట్టు సరిపోతుంది. ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ రెండు అధికార పార్టీలకు అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఉమ్మడి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీ పరస్పరం సహకారంతో ఉన్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే.

