Purushaha: ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్న తరుణంలో ఓ సినిమాను ఆడియెన్స్లోకి తీసుకెళ్లడం, చిత్రం విడుదలకు ముందే హైప్ పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ ‘పురుష:’ (Purushaha) టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే అందరి దృష్టిని ఆకర్షించి, సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయం అవుతుండగా వీరు వులవల (Veeru Ulavala) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్లో మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చిత్రయూనిట్ మూడు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది. ప్రతి పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై క్రేజ్ని పెంచేసింది. తాజాగా మరో పోస్టర్ని మేకర్స్ వదిలారు.
Also Read- Shambhala: టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లోకి ‘శంబాల’.. రిలీజ్కు ముందే లాభాల్లో!
కంటి చూపుతో కాదు
బుధవారం ఈ చిత్ర హీరోయిన్ వైష్ణవి కొక్కుర (Vaishnavi Kokkura) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను గమనిస్తే వైష్ణవి పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అనేట్టు సింబాలిక్గా చూపించినట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఇక పోస్టర్పై ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ చూస్తుంటే.. ఈ పాత్రకు ఎంత వెయిటేజ్ ఉందో అర్థమవుతోంది. మొత్తానికి ఒకరినొకరు అలా సీరియస్గా చూసుకుంటూ ఉండటాన్ని గమనిస్తే ఈ చిత్రంలో భార్యాభర్తల పోరు ఓ రేంజ్లో ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతూ.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మొదటి నుంచి ఇలానే చిత్రయూనిట్ వినూత్నంగా పోస్టర్ను విడుదల చేస్తూ, సినిమాని వార్తలలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Also Read- Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!
పోస్ట్ ప్రొడక్షన్లో
పవన్ కళ్యాణ్తో పాటుగా ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తెలిపాయి. ఇక ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసి మరోసారి ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇంకా ఇతర పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇంకెంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీమ్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

