High Court: ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఇద్దరు ఐఏఎస్అధికారులకు హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే శ్యామ్అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఓ అంశానికి సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాడు. అయితే, దీనిపై ఎలాంటి స్పందన రాకపోవటంతో హైకోర్టులో పిటిషన్వేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శ్యామ్అడిగిన సమాచారాన్ని ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అధికారులు ఈ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు.
Also Read: High Court: హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎందుకంటే..?
సమాచారం ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి?
దాంతో శ్యామ్ హైకోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్భీమపాక నగేశ్ గురువారం విచారణ జరిపారు. ఆర్టీఐ ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి? అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీకి ఇంతకు ముందు కమిషనర్గా పని చేసిన ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ఆర్.వీ.కర్ణన్లకు నోటీసులు జారీ చేశారు. వీరిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో? వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కేసులో జనవరి 26లోపు కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు. లేనిపక్షంలో వారికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: TG High Court: ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నతీరుపై హైకోర్టు సీరియస్!

