Ayodhya: అయోధ్యలో ఘన ఉత్సవం..
Ayodhya ( Image Source: Twitter)
జాతీయం

Ayodhya: నేడు అయోధ్యలో ప్రత్యేక ఘట్టం.. ప్రధాని చేతుల మీదుగా ద్వజారోహణ

Ayodhya: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు అయోధ్యల రామ జన్మభూమి మందిర ప్రధాన శిఖరం (గర్భగుడి శిఖరం) పై కాషాయ రంగు పతాకాన్ని ఆవిష్కరించి, మందిర నిర్మాణం పూర్తయిన సంకేతంగా ఎగురవేసిన తర్వాత ద్వజారోహణ పూర్తవుతుంది. ఇది రామ్ మందిర నిర్మాణం పూర్తయిన చిహ్నంగా భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి ఉద్యమ సేవకులు, కార్యకర్తలు సుమారు 10 వేల మంది హాజరవుతారు. ముఖ్య అతిధులుగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉత్పత్తి మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ 2020 ఆగస్ట్ 5న రామ్ మందిరంలో భూమిపూజ నిర్వహించారు. అంతేకాక, 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

Also Read: Maoists: ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టుల లేఖ.. ఆయుధ విరమణకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి!

పవిత్ర కుంకుమ పతాకం

10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ కోణ త్రిభుజాకార పతాకంపై శ్రీరాముని తేజస్సు, వీరత్వాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యబింబం, ఓం కార చిహ్నం, కోవిదార వృక్ష చిత్రం ఉంటాయి. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పతాకం గౌరవం, ఐక్యత, సాంస్కృతిక నిరంతరత సందేశాన్ని, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. ఉత్తర భారత నాగర శైలిలో నిర్మితమైన ప్రధాన శిఖరంపై ఈ ధ్వజం ఎగురుతుంది. మందిర చుట్టూ ఉన్న 800 మీటర్ల పర్కోట (ప్రదక్షిణ మార్గం) దక్షిణ భారత శైలిలో నిర్మితమై, దేశంలోని వివిధ శైలుల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది.

Also Read: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల్లో గెలిస్తేనే మైలేజ్.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందే : పీసీసీ చీఫ్​ ఆదేశాలు

ప్రధాని మోదీకి సంబంధించిన కార్యక్రమాలు

మోదీ ఆ విస్తృత కార్యక్రమంలో మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహిల్య, నిషాదరాజు గుహుడు, మాత శబరి మందిరాలున్న సప్తమందిర్‌ను దర్శించనున్నారు. ఆ తర్వాత శేషావతార మందిరాన్ని సందర్శిస్తారు. మాతా అన్నపూర్ణ మందిరంలో దర్శనం, పూజ చేస్తారు. ఆ తర్వాత రామ దర్బార్ గర్భగృహం, రామలల్లా గర్భగృహంలో దర్శనం చేసుకుంటారు.

Also Read: IBomma Ravi Investigation: ఆధారాలు ముందు పెట్టినా.. పోలీసులకు పనికి వచ్చే ఎలాంటి సమాచారం రవి ఇవ్వలేదా?

మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రధాన శిఖరంపై కుంకుమ పతాకాన్ని ఆవిష్కరించి, మందిర నిర్మాణ పూర్తి సంకేతంగా సాంస్కృతిక ఉత్సవాలు, జాతీయ ఐక్యతకు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. రామ జన్మభూమి ఉద్యమ చరిత్రలో ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచే మైలురాయిగా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మైలురాయిగా భావిస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..