Indian Squad Announces For Badminton Asia Junior Championships: ఈనెల 28 నుంచి ఇండోనేషియా వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్స్ టోర్నీ అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ టోర్నీకి బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారత్ నుండి జూనియర్ జట్టును పైనల్ చేసింది. సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి 18 మందితో కూడిన జట్టును అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
ఈ జట్టుకు సీనియర్ షట్లర్ తన్వి శర్మ నాయకత్వం వహించనున్నారు. సింగిల్స్లో ప్రణయ్ శెట్టిగార్, అలీషా నాయక్, ధ్రువ్ నెగి, నవ్య కందేరిపై అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ కేటగిరీలో భారత్, ఆతిథ్య ఇండోనేషియా, వియత్నం, ఫిలిప్సీన్స్ దేశాల జట్లతో కలిసి గ్రూపు-సిలో ఉంది. తొలి మ్యాచ్లో వియత్నంతో భారత షట్లర్లు తలపడనున్నారు. టీమ్ ఈవెంట్ తర్వాత వ్యక్తిగత ఈవెంట్ ప్రారంభం కానుంది.
Also Read: ఆటగాడికి వేటు తప్పదా..?
ఈ నేపథ్యంలో బాయ్స్ సింగిల్స్: ప్రణయ్, ధ్రువ్, రౌనక్ చౌహాన్, ప్రణవ్ రామ్, బాయ్స్ డబుల్స్: అర్ష్ మహమ్మద్-సంస్కర్ సరస్వత్, భార్గవ్ రామ్-విశ్వతేజ, గర్ల్స్ సింగిల్స్: తన్వి శర్మ, నవ్య, అలీషా నాయక్, ఆదర్శని శ్రీ మిక్స్డ్ డబుల్స్: భార్గవ్ రామ్-వెన్నెల, వంశ్ దేవ్-శ్రావణి ఆటగాళ్లు పాల్గొననున్నారు. అంతేకాకుండా భారత్ తరుపున ఆడి జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరూ భావిస్తున్నారు.