Errabelli Dayakar Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Errabelli Dayakar Rao: రాష్ట్రంలో రైతుల బాధలు ముఖ్యమంత్రికి పట్టవా?: ఎర్రవెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Rao: అకాల వర్షాల వల్ల పంటలు నేలమట్టం అయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలనీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) అన్నారు. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తీవ్రంగా నష్టపోయిన రైతు పోగు అశోక్‌(Ashock)ను పరామర్శించి, రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే నీటిపాలైపోవడం ఎంతో దారుణం అని వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడ్డ రైతులు ఇలా దెబ్బతినడం చూడలేనిది. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది, అని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపోయిన ప్రతి రైతుకూ..

ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం కాకుండా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు అదైర్యపడొద్దు. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన నేనుంటాను అని భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Also Read: Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!

రైతుల బాధ ఏం తెలుస్తది

రియల్ ఎస్టేట్‌(Real estate)లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి రైతుల బాధ ఏం తెలుస్తది..? సకాలంలో నీళ్లు, యూరియా(Urea), కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటే ఈ స్థాయి నష్టం ఉండేది కాదు అని పేర్కొన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్ చేశారు.

Also Read: Etela Rajender: గురుకులాల్లో ఆత్మహత్యలు.. సౌకర్యాల కొరత, పర్యవేక్షణ లోపంపై.. ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన

Just In

01

Duddilla Sridhar Babu: వీఎఫ్‌ఎక్స్ గేమింగ్‌కు ప్రభుత్వం కో క్రియేటర్.. ఫ్యూచర్స్ ఫండ్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ పిలుపు

Hyderabad Police: నార్త్‌జోన్‌లో నేరగాళ్లకు చెక్.. వేర్వేరు కేసులకు సంబంధించిన నిందితులను అరెస్ట్.. బంగారు నగలు, ఫోన్లు స్వాధీనం!

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకే.. ముస్లీం మైనార్టీ ఓటర్లు ఆలోచించాలి.. టీపీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

Telangana Land Scam: గత ప్రభుత్వంలో పట్టా భూమిగా మారిన సీలింగ్​.. ప్రభుత్వ అధీనంలోని భూములు అన్యాక్రంతం!