Narendra Modi (imagecredit:twitter)
జాతీయం

Narendra Modi: అవినీతి యువరాజులకు అధికారం ఇవ్వొద్దు: ప్రధాని మోదీ

Narendra Modi: బిహార్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ముజఫర్‌పూర్ వెళ్లిన ఆయన కాంగ్రెస్(Congress), ఆర్జేడలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా, రోజూ ఎక్కడో ఒక చోట గొడవ పడుతున్నాయని, వాటి మధ్య సఖ్యత లేదని ఆరోపించారు. పరస్పర విభేదాలతో రెండు పార్టీల నేతలు నూనె, నీరు మాదిరిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ దశాబ్దాలపాటు బిహార్‌(Bihar)ను పాలించి ఏం చేశాయని ప్రశ్నించారు.

Also Read: Deepika Padukone: దీపికాను ఇంకా ఇంకా అవమానిస్తున్నారెందుకు?

అధికారం ఇవ్వొద్దు

ఇక, తనపై చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు మోదీ(Modhi). అలాంటి వారికి వేరే పని ఉండదని, ఎప్పుడూ తనకు చెడ్డ పేరు తీసుకురావడం కోసమే ఆలోచిస్తుంటారని సెటైర్లు వేశారు. తర్వాత చాప్రాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన అవినీతి యువరాజులకు అధికారం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. బిహార్ ప్రజల కల తన సంకల్పమని అన్నారు. ప్రచారంలో తనను దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని, సామాన్యులను అవమానించకుండా ఉన్నత వర్గాల వారు తమ ఆహారాన్ని జీర్ణించుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులను, వెనుకబడిన వర్గాలను దుర్వినియోగం చేయడం వారి జన్మ హక్కు అంటూ మోదీ మండిపడ్డారు.

Also Read: Warangal: వరంగల్ ను అతలాకుతలం చేసిన మొంథా.. ముగ్గురు మృతి.. తెగిన రోడ్లు నిలిచిపోయిన రాకపోకలు

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు